కవిత బీజేపీ వదిలిన బాణం
NEWS Jun 02,2025 12:06 pm
కాంగ్రెస్ మాజీ ఎంపీ మధు యాష్కి గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఎమ్మెల్సీ కవితపై మండిపడ్డారు. ఇదంతా కల్వకుంట్ల ఫ్యామిలీ ఆడుతున్న నాటకమని కొట్టి పారేశారు. కవిత బీజేపీ వదిలిన బాణం అంటూ భగ్గుమన్నారు. లిక్కర్ కేసు నుంచి బయట పడేందుకు కవితకు బీజేపీ సహకారం కావాలన్నారు. బీజేపీ వ్యూహరచనలో భాగంగా కేసీఆర్కు కవిత లేఖ రాశారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ బలహీన పడితే బీజేపీ స్ట్రాంగ్ అవుతుందనేది ప్రధాని మోడీ స్ట్రాటజీ అన్నారు.