అత్తగారింటికి వచ్చిన వ్యక్తి మిస్సింగ్
NEWS May 29,2025 08:37 pm
మల్లాపూర్ మండలం సాతారానికి చెందిన ఎర్ర గణేశ్ (35) అదృశ్యం అయినట్లు మెట్ పల్లి పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. రామలచ్చక్కపేటలోని అత్తగారింటికి వచ్చిన గణేశ్ బుధవారం రాత్రి నుంచి కనిపించకపోవడంతో చుట్టుపక్కల ఎంత వెతికినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కనిపిస్తే 91005 71562 నంబర్ కు సమాచారం అందించాలని కోరారు.