Logo
Download our app
క‌ష్ట‌ప‌డిన ప్ర‌తి కార్య‌క‌ర్త‌కు న్యాయం చేస్తాం
NEWS   May 22,2025 06:03 pm
పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన ప్ర‌తి ఒక్క కార్య‌క‌ర్త‌కు న్యాయం చేస్తామ‌ని అన్నారు హోం శాఖ మంత్రి వంగ‌ల‌పూడి అనిత‌. అన‌కాప‌ల్లి జిల్లాలో జ‌రిగిన మినీ మ‌హానాడులో పాల్గొన్నారు. పాయకరావుపేట నియోజకవర్గ ప్రజలు త‌న‌కు భారీ మెజారిటీ ఇచ్చార‌ని, వారి రుణం తీర్చుకోలేన‌ని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో టీడీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టారని గుర్తు చేశారు. గత ఐదు సంవత్సరాలలో పాయకరావుపేటలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కానీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి, సంక్షేమం రెండూ సమాంతరంగా నడుస్తున్నాయి అని తెలిపారు.
⚠️ You are not allowed to copy content or view source