జగన్ కామెంట్స్ కేశవ్ సీరియస్
NEWS May 22,2025 05:53 pm
వైఎస్ జగన్ వ్యాఖ్యలకు మంత్రి పయ్యావుల కౌంటర్ ఇచ్చారు. అస్తిత్వం కాపాడు కోవడానికి జగన్ మాట్లాడుతున్నారని, అభివృద్ధిని అడ్డుకోవడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. YCP హయాంలోనే ల్యాండ్, మైన్స్, శాండ్, వైన్ స్కామ్లు జరిగాయన్నారు. రివర్స్ టెండరింగ్తో పోలవరం ఖర్చు మూడింతలు అయ్యిందన్నారు. దీనికి తనే బాధ్యత వహించాలన్నారు. విశాఖను నాశనం చేశారు, పరిశ్రమలు తరిమేశారన్నారు. ఐదేళ్ల పాలనలో రూ.10 లక్షల కోట్ల అప్పు చేశారంటూ ధ్వజమెత్తారు.