టీటీడీ సీవీఎస్వోగా కేవీ మురళీకృష్ణ
NEWS May 21,2025 09:50 am
ఏపీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. భద్రతా కారణాల రీత్యా ఇటీవల చోటు చేసుకున్న ఘటనల నేపథ్యంలో సీవీఎస్వోగా సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ కేవీ మురళీకృష్ణను నియమించింది. ఈ విషయంలో సీఎం ఆదేశాల మేరకు టీటీడీ ఈ నిర్ణయం తీసుకుంది. గతంలో తను తిరుమలలో పని చేశారు. ఆయనకు ఇక్కడ పని చేసిన అనుభవం ఉండడంతో తన వైపు మొగ్గు చూపింది. త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించనున్నారు. సీఎం సిఫారసు మేరకు ఏపీ చీఫ్ సెక్రటరీ విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.