Logo
Download our app
కొండపోచమ్మ సాగర్ అక్రమాలపై విచార‌ణ
NEWS   May 20,2025 08:49 am
తెలంగాణ స‌ర్కార్ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. కొండ పోచ‌మ్మ సాగ‌ర్ అక్ర‌మాల‌పై విజిలెన్స్ విచార‌ణ‌కు ఆదేశించింది. ఈ నెల 26 నుంచి విచారణ ప్రారంభం కానుంది. ఈ మేర‌కు 63 మంది ఇంజినీర్లకు సమన్లు జారీ చేసింది. ఏఈఈలు నుంచి ఈఎన్సీల వరకు హాజరు కావాల్సిందేనని స్ప‌ష్టం చేసింది. 8 రోజుల పాటు విచార‌ణ కొన‌సాగుతుంది. ఫిర్యాదుతో రంగంలోకి దిగింది విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్‌. మల్లన్నసాగర్ నుంచి కొండపోచమ్మ వరకు 13, 14వ ప్యాకేజీలపై దర్యాప్తు చేయ‌నుంది.
⚠️ You are not allowed to copy content or view source