Logo
Download our app
స్వర్ణరథంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు
NEWS   May 19,2025 06:43 am
శ్రీనివాస మంగాపురంలో కొలువు తీరిన శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక వసంతోత్సవాలు అంగ‌రంగ వైభ‌వంగా జ‌రుగుతున్నాయి. ఉత్స‌వాల‌లో భాగంగా శ్రీ స్వామి వారి స్వర్ణ రథోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు. మ‌హిళ‌లు పెద్ద సంఖ్య‌లో పాల్గొని ర‌థాన్ని లాగారు. ఉదయం సుప్రభాతంతో స్వామి వారిని మేల్కొలిపి, తోమాల, కొలువు, పంచాంగ శ్రవణం, సహస్ర నామార్చన నిర్వహించారు. అనంతరం శ్రీవారి ఉత్సవర్లను వసంత మండపానికి వేంచేపు చేసి ఆస్థానం చేప‌ట్టారు.
⚠️ You are not allowed to copy content or view source