Logo
Download our app
బిల్డ‌ర్లు మ‌ట్టిపోస్తే చ‌ర్య‌లు త‌ప్ప‌వు
NEWS   May 17,2025 07:23 pm
హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు బిల్డ‌ర్ల‌కు, రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారుల‌కు. చెరువుల్లో మ‌ట్టి పోసినా, లేదా త‌వ్వినా క్రిమిన‌ల్ కేసులు న‌మోదు చేస్తామ‌ని అన్నారు. ప్ర‌కృతి స‌మ‌తుల్య‌త‌కు చెరువుల ప‌రిర‌క్ష‌ణ ఎంతో అవ‌స‌ర‌మ‌ని. ఆ దిశ‌గా హైడ్రా ప‌నిచేస్తోంద‌ని చెప్పారు. బిల్డ‌ర్లు - ట్రాన్స్‌పోర్ట‌ర్లు క‌ల‌సి.. మ‌ట్టిని ఎక్క‌డ పోయాలో ముందుగానే ఒక అవ‌గాహ‌న‌కు రావాల‌ని సూచించారు. శిఖం భూముల‌లో కూడా మ‌ట్టి నింప‌రాద‌ని సూచించారు. హైడ్రా పోలీసు స్టేష‌న్ కూడా అందుబాటులోకి వ‌చ్చిందన్నారు క‌మిష‌న‌ర్.
⚠️ You are not allowed to copy content or view source