బెజవాడలో తిరంగా ర్యాలీ
NEWS May 17,2025 06:57 am
ఆపరేషన్ సిందూర్ సక్సెస్ కావడంతో విజయవాడలో ఏపీ కూటమి సర్కార్ ఆధ్వర్యంలో తిరంగా ర్యాలీ నిర్వహించారు. ఇందిరాగాంధీ స్టేడియం నుంచి బెంజి సర్కిల్ వరకు ర్యాలీ జరిగింది. త్రివిధ దళాలకు మద్దతుగా ర్యాలీ చేపట్టారు. ఈ ర్యాలీలో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, పలువురు ఏపీ మంత్రులు, కూటమి నేతలు పాల్గొన్నారు.