యుపీఎస్సీ చైర్మన్ గా అజయ్ కుమార్
NEWS May 14,2025 07:54 am
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అత్యంత ప్రతిష్టాత్మకమైన యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) చైర్మన్ గా మాజీ రక్షణ శాఖ కార్యదర్శి అజయ్ కుమార్ ను నియమించింది. ఆయన కేరళ క్యాడర్ కు చెందిన వ్యక్తి. 2019 నుంచి 2022 వరకు రక్షణ శాఖలో పని చేశారు. ఏప్రిల్ 29న ఇప్పటి వరకు చైర్మన్ గా ను ప్రీతి సుదాన్ పదవీ కాలం ముగియడంతో ఆ పోస్టు ఖాళీగా ఉంది. ఇందులో 10 మంది దాకా సభ్యులను నియమించే ఛాన్స్ ఉంది.