Logo
Download our app
జవాన్ నాయ‌క్ కు రూ. 50 ల‌క్ష‌ల సాయం
NEWS   May 11,2025 10:35 am
జవాన్ మురళి నాయక్ కుటుంబానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అండగా ఉంటాయని స్ప‌ష్టం చేశారు మంత్రి నారా లోకేష్. నాయక్ కుటుంబానికి రూ.50 లక్షల ఆర్థిక సాయం చేస్తున్నామ‌న్నారు. 5 ఎకరాల భూమి, ఇంటి కోసం 300 గజాల స్థలం ఇస్తున్న‌ట్లు తెలిపారు. ముర‌ళీ నాయ‌క్ తండ్రికి ప్ర‌భుత్వ ఉద్యోగం ఇస్తున్నామ‌న్నారు. ఈ మేర‌కు త‌న పేరు మీద మెమోరియ‌ల్ క‌ట్టాల‌ని నిర్ణ‌యించామ‌న్నారు. జిల్లా హెడ్ క్వార్ట‌ర్స్ లో కాంస్య విగ్ర‌హాన్ని ఏర్పాటు చేస్తామ‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source