Logo
Download our app
టర్కీ కాన్సులేట్ వ‌ద్ద భారీ భ‌ద్ర‌త
NEWS   May 10,2025 04:31 pm
హైదరాబాద్-జూబ్లీహిల్స్‌లోని రిపబ్లిక్ టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల‌ను బిగించారు. ఆంక్ష‌లు విధించారు. భారత్ సరిహద్దులో పాకిస్థాన్‌కు చెందిన 400 డ్రోన్‌లను పేల్చేసింది భారత్ . శ‌త్రుదేశం పాకిస్తాన్ కు డ్రోన్ల‌ను అంద‌జేసింది ట‌ర్కీ. గ‌గ‌న త‌లంలోనే డ్రోన్ల‌ను ధ్వంసం చేసింది. ఈ మేరకు టర్కీ కాన్సులేట్ జనరల్ వద్ద ఆందోళనలు జరిగే అవకాశం ఉన్నందున పోలీసులు గట్టి బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.
⚠️ You are not allowed to copy content or view source