Logo
Download our app
భద్రతా ఏర్పాట్లపై హైలెవల్ కమిటీ భేటీ
NEWS   May 07,2025 09:27 pm
భార‌త‌, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య ఉద్రిక్త‌త‌ల నేప‌థ్యంలో తెలంగాణ‌లో ప్ర‌భుత్వం అల‌ర్ట్ అయ్యింది. ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌ను ర‌ద్దు చేసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైలెవ‌ల్ క‌మిటీ భేటీకి హాజ‌ర‌య్యారు. ఆపరేషన్‌ సిందూర్‌, మాక్ డ్రిల్ తర్వాత పరిస్థితులపై స‌మీక్ష చేప‌ట్టారు. ముందస్తుగా తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. అన్ని శాఖలు సమన్వయంతో పని చేయాలని సూచించారు. నిత్యావ‌స‌ర వ‌స్తువుల కొర‌త లేకుండా చూడాల‌ని ఆదేశించారు.
⚠️ You are not allowed to copy content or view source