Logo
Download our app
ఆర్మీ, నేవీ, ఎయిర్ పోర్ట్ వ‌ద్ద భ‌ద్ర‌త పెంచండి
NEWS   May 07,2025 09:03 pm
భార‌త, పాకిస్తాన్ దేశాల మ‌ధ్య తీవ్ర ఉద్రిక్త‌త‌లు చోటు చేసుకున్న నేప‌థ్యంలో సీఎం రేవంత్ రెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. హైదరాబాద్‌ పరిధిలోని ఆర్మీ, నేవీ కార్యాలయాల వద్ద కట్టుదిట్టమైన భద్రత పెంచాల‌న్నారు. అంతే కాకుండా విమానాశ్రయం దగ్గర సెక్యూరిటీని మ‌రింత పెంచాల‌ని ఆదేశించారు. విదేశీ రాయబార కార్యాలయాల వద్ద కూడా బలగాల మోహరించాల‌ని, కమాండ్ కంట్రోల్ సెంట్రల్ కేంద్రంగా సమాచార వ్యవస్థను ఏర్పాటు చేసుకోవాలని స్ప‌ష్టం చేశారు.
⚠️ You are not allowed to copy content or view source