Logo
Download our app
గ్రూప్‌-1 అక్రమాల కేసులో ధాత్రి అరెస్ట్
NEWS   May 06,2025 04:37 pm
ఏపీపీఎస్సీ (APPSC) గ్రూప్‌-1 అక్రమాల కేసులో ధాత్రి మధును పోలీసులు అరెస్టు చేశారు. ‘క్యామ్‌సైన్‌ మీడియా’ సంస్థకు అతడు డైరెక్టర్‌గా ఉన్నాడు. ఏపీపీఎస్సీ గ్రూప్‌-1 మెయిన్స్‌ జవాబు పత్రాల మూల్యాంకనంలో అక్రమాలకు పాల్పడ్డారని అతడిపై ఆరోపణలు ఉన్నాయి. దీంతో హైదరాబాద్‌లోని అతడి కార్యాలయంలో మధును ఏపీ పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం విజయవాడకు తరలించారు. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్‌లో ‘క్యామ్‌సైన్‌ మీడియా’ సంస్థ ప్రతినిధి పేరును ఏ2గా చేర్చారు. నిబంధనలకు విరుద్ధంగా.. కొటేషన్‌ విధానంలో మూల్యాంకన బాధ్యతలు పొందిన సదరు సంస్థ అవకతవకలకు పాల్పడినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది.
⚠️ You are not allowed to copy content or view source