Logo
Download our app
కొండగట్టులో భక్తుల సందడి
NEWS   May 06,2025 03:42 pm
ప్రముఖ పుణ్యక్షేత్రం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం మంగళవారం భక్తులతో సందడిగా మారింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు వేకువజాం నుంచే కొండపైకి చేరుకొని కోనేరులో పుణ్య స్థానాల ఆచరించి, స్వామివారి సేవలో తరించారు. దీంతో ఆలయంతో పాటు ఆలయ పరిసర ప్రాంతాలు భక్తులతో కిక్కిరిసాయి. దాదాపు 20 వేలకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి, పూజలు అభిషేకాలు నిర్వహించారు.
⚠️ You are not allowed to copy content or view source