Logo
Download our app
మావోయిస్టులతో చర్చల ప్రసక్తే లేదు
NEWS   May 04,2025 12:50 pm
కేంద్ర మంత్రి బండి సంజ‌య్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మావోయిస్టుల‌పై చ‌ర్చ‌లు జ‌రిపే ప్ర‌స‌క్తి లేద‌న్నారు. తుపాకీ చేతపట్టి అమాయకులను పొట్టన పెట్టుకున్నవాళ్లతో చర్చలు ఉండవన్నారు.మావోయిస్టులను నిషేధించింది కాంగ్రెస్సే న‌ని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ సహా ఎంతో మంది నేతలను మావోయిస్టులు చంపారన్నారు. ఎన్నో కుటుంబాలకు మానసిక క్షోభ మిగిల్చారంటూ మండిప‌డ్డారు. తుపాకీ వీడనంత వరకు మావోయిస్టులతో చర్చలు ఉండవన్నారు.
⚠️ You are not allowed to copy content or view source