కుల గణనపై కేంద్రం స్పష్టత ఇవ్వాలి
NEWS May 01,2025 07:28 pm
ఎంఐంఎ చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ కేంద్రంపై నిప్పులు చెరిగారు. కుల గణనపై ఎప్పటి లోగా పూర్తి చేస్తారో స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2029 లోక్ సభ ఎన్నికలకు ముందు కులగణన డేటా అందుబాటులోకి వస్తుందా అని ప్రశ్నించారు. కేవలం రాజకీయ నేపథ్యంలో ఈ కీలక ప్రకటన చేశారంటూ ఆరోపించారు. జనానికి స్పష్టత ఇవ్వకుండా , తమతో సంప్రదించకుండా నిర్ణయం తీసుకోవడం విడ్డూరంగా ఉందన్నారు.