మోదీ నన్ను ఫాలో అవుతున్నారు
NEWS May 01,2025 12:05 pm
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధాని మోదీని ఉద్దేశించి సంచలన కామెంట్స్ చేయడం కలకలం రేపింది. దేశంలో చాలా మంది మోదీని ఫాలో అవుతున్నారని, కానీ తాను మాత్రం తనను ఫాలో అవుతున్నారంటూ పేర్కొన్నారు. ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో కుల గణన చేపట్టామన్నారు. తాము తీసుకు వచ్చిన దీనిని కేంద్రం ఇప్పుడు గత్యంతరం లేక అమలు చేసేందుకు ప్రకటించిందన్నారు. మొత్తంగా సీఎం తాజాగా చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మోదీ తనను ఫాలో అవుతుంటే చూసి బీజేపీ నేతలు తట్టుకోలేక పోతున్నారంటూ ఎద్దేవా చేశారు.