త్వరలోనే కులగణన చేయిస్తాం
NEWS Apr 30,2025 08:52 pm
కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే జనాభా లెక్కలతో పాటు కులగణన చేపట్టాలని కేబినెట్ భేటీలో నిర్ణయించామని కేంద్ర మంత్రి అశ్వనీ వైష్ణవ్ ప్రకటించారు. కాంగ్రెస్ అధికార రాష్ట్రాల్లో చేయించిన కులాల సర్వే సరిగా జరగలేదని ఆరోపించారు. తాము పక్కాగా లెక్కలు తెలుసుకుంటామని అన్నారు. కులాల జనాభా లెక్కించి ఆ సంఖ్య ఆధారంగా సంక్షేమ పథకాలు అందించాలని విపక్ష పార్టీలు, ప్రజా సంఘాలు కొంత కాలంగా కోరుతున్న వేళ కేంద్రం ఈ నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశంగా మారింది.