నేడే పదవ తరగతి పరీక్షా ఫలితాలు
NEWS Apr 30,2025 05:36 am
పదవ తరగతి పరీక్షా ఫలితాలు బుధవారం వెల్లడి కానున్నాయి. రిజల్ట్స్ ను రిలీజ్ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఆయన వద్దే విద్యా శాఖ ఉంది. ఈసారి విద్యార్థుల మోమోలలో సబ్జెక్టుల వారీగా గ్రేడింగ్తో పాటు మార్కులు ఇస్తారు. పలు ఎంట్రన్స్ల వెయిటేజికి ఇబ్బందిగా మారకుండా మళ్లీ మార్కుల పద్ధతిని తీసుకు వచ్చారు. గత మార్చి 21 నుంచి ఏప్రిల్ 4 వరకు టెన్త్ ఎగ్జామ్స్ జరిగాయి. మొత్తం 5 లక్షల మంది పరీక్షలు రాశారు.