నేడే పద్మ పురస్కారాల ప్రదానం
NEWS Apr 28,2025 07:48 am
న్యూఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. వాటికన్ లో పోప్ అంత్యక్రియలకు హాజరైన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఢిల్లీకి విచ్చేశారు. ఈ సందర్బంగా పద్మ పురస్కారాలకు ఎంపికైన వారికి అవార్డులను ప్రదానం చేయనున్నారు. పద్మభూషణ్ అవార్డును అందుకోనున్నారు ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ. కుటుంబీకులు కూడా హాజరు కానున్నారు.