చిట్టాపూర్ లో అమరులకు అశ్రునివాళి
NEWS Apr 26,2025 11:16 pm
మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలోని ఏకల్ అభియాన్ ఆధ్వర్యంలో అమరులకు నివాళి అర్పించారు. పహల్గాంలోని పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడానికి ఖండిస్తూ నిరసనగా శాంతి ర్యాలీ నిర్వహించి అమరులకు నివాళి అర్పించారు. కాల్పుల్లో మృతి చెందిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కఠిన చర్యలు తీసుకోవాలని దాడులు చేసిన ఉగ్రవాదులను పట్టుకుని తగిన శిక్షలు విధించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాతాజీ గాండ్ల లత సామా తదితరులు పాల్గొన్నారు.