ఇంకుడు గుంతల పని పరిశీలించిన కమిషనర్
NEWS Apr 26,2025 11:14 pm
మెట్పల్లి: మున్సిపల్ కమిషనర్ మోహన్ పట్టణంలో ఇంకుడు గుంతల పనిని పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ.. వర్షపు నీరు వృధా కాకుండా భూగర్భ జలాలు పెంచడానికి పట్టణంలో 12 ఇంకుడు గుంతలు ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం డా. అంబేద్కర్ మినీ స్టేడియం, డీఆర్సీసీ సెంటర్లో కట్టడం జరుగుతుందని మిగతావి కూడా 10 ఇంకుడు గుంతలు కట్టడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీ. ఈ నాగేశ్వరరావు, ఇన్చార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ రత్నాకర్ తదితరులు పాల్గొన్నారు.