Logo
Download our app
ఉగ్ర దాడిలో మ‌తం గురించి మాట్లాడితే ఎలా..?
NEWS   Apr 26,2025 04:59 pm
మ‌రాఠా డిప్యూటీ సీఎం ఏక్ నాథ్ షిండే షాకింగ్ కామెంట్స్ చేశారు. పహల్గాం ఉగ్రదాడిలో జాతి, మతం గురించి మాట్లాడితే ఎలా అని ప్ర‌శ్నించారు. ఈ ఘ‌ట‌న‌లో మరణించిన సయ్యద్ హుస్సేన్ షా కుటుంబానికి రూ.5 లక్షలు ఆర్థిక సాయం, ఇల్లు కట్టిస్తామని హామీ ఇచ్చారు. పర్యాటకులను కాపాడడానికి వెళ్ళి మరణించిన త‌ను కూడా అమ‌రుడేన‌ని అన్నారు. ఉగ్ర‌వాదుల నుండి గ‌న్ కూడా లాక్కున్నాడ‌ని, త‌ను నిజ‌మైన యోధుడ‌న్నారు. వాళ్ల కుటుంబాన్ని ఓదార్చేందుకు వెళ్లిన స‌మ‌యంలో వారి ఆర్థిక ప‌రిస్థితి ద‌య‌నీయంగా ఉంద‌న్నారు.
⚠️ You are not allowed to copy content or view source