Logo
Download our app
బీఆర్ఎస్ ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు స‌ర్వం సిద్దం
NEWS   Apr 26,2025 04:08 pm
ఓరుగ‌ల్లు మ‌రోసారి గులాబీమ‌యం కానుంది. ఏప్రిల్ 27న ఆదివారం 10 ల‌క్ష‌ల మందికి పైగా హాజ‌రు కానున్నారు. బీఆర్ఎస్ ఏర్ప‌డి 25 ఏళ్ల‌వుతోంది. ఈ సంద‌ర్బంగా ర‌జ‌తోత్స‌వ స‌భ‌కు న‌భూతో న‌భ‌విష్య‌త్ అన్న రీతిలో ఏర్పాట్లు చేసింది పార్టీ. 1,213 ఎక‌రాల‌లో ఈ స‌భ జ‌ర‌గ‌నుంది. 154 ఎక‌రాల్లో మ‌హా స‌భ ప్రాంగ‌ణం, 500 మంది కూర్చునేలా ప్ర‌ధాన వేదిక‌తో పాటు 1,059 ఎక‌రాల్లో పార్కింగ్ ఏర్పాటు చేశారు. 10 ల‌క్ష‌ల వాట‌ర్ బాటిళ్లు, 16 ల‌క్షల మ‌జ్జిగ ప్యాకెట్లు, వివిధ రూట్ల‌లో 6 అంబులెన్సులు, ప‌రిస‌రాల్లో 12 వైద్య శిబిరాలు,1,200 తాత్కాలిక మ‌రుగుదొడ్లు, పార్కింగ్ నిర్వ‌హ‌ణ‌కు 2,000 మంది వాలంటీర్లను ఏర్పాటు చేశారు. 2001లో టీఆర్ఎస్ ను ఏర్పాటు చేశారు. 2014లో సాధించేంత వ‌ర‌కు ఎన్నో పార్టీలు చేసింది.
⚠️ You are not allowed to copy content or view source