కంచి కామకోటి పీఠాధిపతిగా గణేశ శర్మ
NEWS Apr 26,2025 12:11 pm
కంచి కామకోటి పీఠం పీఠాధిపతిగా గణేశ్ శర్మ కొలువు తీరనున్నారు. ఈ సందర్బంగా కీలక ప్రకటన చేశారు ప్రస్తుత పీఠాధిపతి శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి. ఈ నెల 30న గణేశశర్మకు సన్యాస దీక్ష ఇవ్వనున్నారు. గణేశశర్మ స్వస్థలం కాకినాడ జిల్లా అన్నవరం. గణేశశర్మ తల్లిదండ్రులు దుడ్డు ధన్వంతరి, మంగాదేవి. ఈ సందర్బంగా సంతోషానికి లోనయ్యారు గణేశ శర్మ. అత్యున్నతమైన పీఠానికి తనను ఎంపిక చేయడం పట్ల ధన్యవాదాలు తెలిపారు.