Logo
Download our app
క‌ష్ట‌ప‌డండి ఉన్న‌త ఫ‌లితాలు సాధించండి
NEWS   Apr 26,2025 08:44 am
బీసీ యువత ఉన్నతే సీఎం చంద్రబాబు లక్ష్యమని మంత్రి ఎస్.సవిత స్ప‌ష్టం చేశారు. కార్పొరేట్ కు ధీటుగా సివిల్ సర్వీసెస్ శిక్షణా కేంద్రలో బోధనా సదుపాయలు కల్పించా మన్నారు. విజయవాడలోని గొల్లపూడిలో ఉన్న బీసీ భవన్ లో బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సివిల్ సర్వీసెస్ శిక్షణ కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె వంట గదిని పరిశీలించారు. అనంతరం అభ్యర్థుల విశ్రాంతి గదులను, బాత్ రూమ్ లను, పరిశీలించారు. అదే సమయంలో సీ సెట్ పరీక్ష జరుగుతున్న తరగతిని కూడా పరిశీలించారు. ఎంతమంది విద్యార్థుల పరీక్షకు హాజరయ్యారని కో ఆర్డినేటర్ సాగర్ ను అడిగి తెలుసుకున్నారు. పక్క గదిలో ఉన్న డిజిటల్ లైబ్రరీని సందర్శించి, అక్కడున్న పలువురు అభ్యర్థులతో మంత్రి సవిత మాట్లాడారు.
⚠️ You are not allowed to copy content or view source