భూ కేటాయింపులపై సమగ్ర విచారణ చేపట్టాలి
NEWS Apr 26,2025 08:09 am
షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్ కంపెనీకి చెందిన భూములు శేషాచలం వైల్డ్ లైఫ్ రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలోకి వస్తాయని దీనిపై తక్షణమే నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఏపీ డిప్యూట సీఎం పవన్ కళ్యాణ్. కంపెనీకి కేటాయించిన భూముల్లో అటవీ భూముల క్రమబద్దీకరణ చట్టం 1980 నిబంధనలు పూర్తిగా గాలికి వదిలేశారని, అటవీ చట్టాలను పూర్తిగా ఉల్లంఘించి కేటాయింపులు జరిపారని ఆరోపణలు వచ్చాయి. భూ కేటాయింపులు, సంబంధిత వివరాలు నివేదిక రూపంలో అందజేయాలని, కేటాయింపుల ప్రక్రియపైనా వివరాలు ఇవ్వాలని స్పష్టం చేశారు.