ఢిల్లీలో ప్రధాని మోదీతో చంద్రబాబు భేటీ
NEWS Apr 25,2025 07:37 pm
ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీలో ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. పహల్గాం ఉగ్రదాడిని తీవ్రంగా ఖండించారు. కేంద్ర నిర్ణయానికి రాష్ట్రం మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు. మే2న అమరావతి పునః ప్రారంభ పనులకు రావాల్సిందిగా పీఎంను ఆహ్వానించారు. లక్ష కోట్లకు పైగా ప్రాజెక్టు పనులకు శంకు స్థాపన చేయాల్సిందిగా కోరారు. దాదాపు 5 లక్షల మందికి పైగా జనం హాజరవుతారని తెలిపారు. మోదీ రోడ్ షో నిర్వహిస్తారని, 30 వేల మంది పాల్గొంటారని అంచనా. ఈ సందర్బంగా పైలాన్ ను కూడా ఆవిష్కరిస్తారని చెప్పారు సీఎం.