అన్న కేశినేనిపై నాని 100 కోట్ల పరువు నష్టం దావా
NEWS Apr 25,2025 06:04 pm
విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని చిన్ని తన సోదరుడు మాజీ ఎంపీ కేశినేని నానిపై రూ. 100 కోట్ల పరువు నష్టం దావా వేశారు. ఇటీవల ఉర్సా సంస్థకి భూ కేటాయింపులపై సీఎం చంద్రబాబుకు లేఖ రాయడం కలకలం రేపింది. ఉర్సా కంపెనీ ఎంపీ బినామీలదంటూ ఆరోపించారు. దీనిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అవాస్తవాలతో తన పరువుకి నష్టం కలిగించారంటూ అన్నపై మండిపడ్డారు. దావా వేశారు కోర్టులో.