ఇది దేశం మీద జరిగిన దాడి
NEWS Apr 25,2025 04:59 pm
పహల్గామ్ ఉగ్రదాడిపై ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిలా రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఇది దేశం మీద జరిగిన దాడిగా పేర్కొన్నారు. ఓవైపు టూరిస్టులు చనిపోతుంటే సైన్యం ఎందుకు రాలేదంటూ ప్రశ్నించారు. పహల్గామ్ ఉగ్రదాడి ముమ్మాటికీ భద్రతా వైఫల్యమేనని ఆరోపించారు. ఇంటెలిజెన్స్ ను రాజకీయ శత్రువుల కోసం కేంద్రం వాడుతోందన్నారు. పహల్గామ్ ఉగ్రదాడికి బాధ్యులు ఎవరు అంటూ నిలదీశారు.