మాజీ మంత్రి రజినీకి భారీ ఊరట
NEWS Apr 25,2025 04:51 pm
మాజీ మంత్రి విడుదల రజినీకి భారీ ఊరట లభించింది. తనపై అక్రమంగా కేసు నమోదు చేశారని ఆరోపిస్తూ ముందస్తు అరెస్ట్ చేయొద్దంటూ ఏపీ హైకోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఈ సందర్బంగా విచారణ చేపట్టింది కోర్టు. ఆమెకు సంబంధించి పోలీసులు దూకుడు ప్రదర్శించవద్దని స్పష్టం చేసింది. ఇదే సమయంలో 41ఏ నోటీస్ ఇచ్చి విచారించాలని సీఐడీని ఆదేశించింది హైకోర్టు.