ఇండియాకు ఇటలీ పూర్తి మద్దతు
NEWS Apr 25,2025 08:53 am
ఇటలీ ప్రధాని జార్జియా మెలోని ప్రధాని మోదీకి ఫోన్ చేశారు. ఆమె భారత దేశానికి పూర్తి మద్దతు తెలిపారు. 26 మందిని బలిగొన్న పహల్గామ్ ఉగ్రవాద దాడిపై ఆమె సంఘీభావం ప్రకటించారు. ఉగ్రవాద వ్యతిరేక ప్రయత్నాలను బలోపేతం చేయడానికి భారతదేశం, ఇటలీ కలిసి పనిచేస్తాయని ఆమె అన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు , ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమాన్యుయేల్ మాక్రాన్ కూడా ప్రధాని మోదీకి ఫోన్ చేసి వ్యక్తిగత సంతాపం తెలిపారు.