పాక్ పౌరులకు వీసా సేవలు బంద్
NEWS Apr 24,2025 06:33 pm
పహల్గామ్ ఉగ్రవాద దాడి నేపథ్యంలో కేంద్ర భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ పౌరులకు వీసా సేవలను నిలిపి వేసింది. ఏప్రిల్ 27 నుంచి పాకిస్థాన్ జాతీయులకు చెల్లుబాటు అయ్యే అన్ని వీసాలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. మెడికల్ వీసాలకు ఏప్రిల్ 29 (2 రోజులు అదనంగా) వరకు గడువు ఇస్తున్నట్లు తెలిపింది.