పాకిస్తాన్ తో క్రికెట్ ఆడబోం
NEWS Apr 24,2025 06:33 pm
బీసీసీఐ సంచలన నిర్ణయం తీసుకుంది. భవిష్యత్తులో కూడా పాకిస్తాన్ క్రికెట్ జట్టుతో ద్వైపాక్షిక సీరీస్ ను ఆడబోమంటూ ప్రకటించింది. ఎప్పటికీ పాక్ తో మ్యాచ్ లు ఉండవంటూ స్పష్టం చేసింది. ఐసీసీ కారణంగానే పాక్తో తటస్థ వేదికలో ఆడుతున్నట్లు బీసీసీఐ వైస్ ప్రెసిడెంట్ రాజీవ్ శుక్ల వెల్లడించారు. ఇక్కడేం జరుగుతుందో ఐసీసీకి అవగాహన ఉందనుకుంటున్నామని పేర్కొన్నారు.