ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీ వీసీగా చంద్రశేఖర్
NEWS Apr 24,2025 06:32 pm
ఏపీ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వ విద్యాలయం వైస్ ఛాన్సలర్ గా డాక్టర్ పి. చంద్రశేఖర్ ను నియమించింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. వీసీగా సిఫారసు చేశారు సీఎం చంద్రబాబు. గవర్నర్ అబ్దుల్ నజీర్ ఆమోదం తెలిపారు. ఇదిలా ఉండగా చంద్రశేఖర్ చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురంలో కార్డియాలజీ సర్జన్ గా పని చేశారు.