ఏపీని ఏఐ హబ్ గా మార్చేస్తాం - సీఎం
NEWS Apr 24,2025 06:32 pm
ఏపీని ఏఐ హబ్ గా మార్చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ అండ్ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్సఫర్మేషన్ అంశంపై సచివాలయంలో ఉన్నతాధికారులతో వర్క్షాప్ చేపట్టారు. ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్, ఇతర ఎమర్జింగ్ టెక్నాలజీల ఆవశ్యకత, పాలనలో వాటి వినియోగంపైన మార్గనిర్దేశం చేశారు. వర్క్షాప్కు హాజరైన సీఎస్, డీజీపీ, వివిధ శాఖల అధికారులు, కేంద్ర ఐటీ శాఖ మాజీ సెక్రటరీ చంద్రశేఖర్ హాజరయ్యారు. వాద్వాని సెంటర్ ఫర్ గవర్నమెంట్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ సీఈవో ప్రకాష్ కుమార్, డబ్ల్యుజీడీటీ డీన్ కమల్ దాస్తో సహా పలువురు నిపుణులు హాజరయ్యారు.