Logo
Download our app
ఢిల్లీ క్యాపిట‌ల్స్ దెబ్బ ల‌క్నో జెయింట్స్ అబ్బా
NEWS   Apr 23,2025 08:07 am
ఐపీఎల్ 2025 మెగా టోర్నీలో భాగంగా ల‌క్నో వేదిక‌గా జ‌రిగిన కీల‌క లీగ్ మ్యాచ్ లో హ‌ర్ష‌ల్ ప‌టేల్ సార‌థ్యంలోని ఢిల్లీ క్యాపిట‌ల్స్ దుమ్ము రేపింది. రిష‌బ్ పంత్ సార‌థ్యంలోని ల‌క్న సూప‌ర్ జెయింట్స్ కు చుక్క‌లు చూపించింది. ఏకంగా 8 వికెట్ల తేడాతో విజ‌య‌భేరి మోగించింది. ల‌క్నోకు గ‌తంలో స్కిప్ప‌ర్ గా వ్య‌వ‌హ‌రించిన కేఎల్ రాహుల్ ఆకాశ‌మే హ‌ద్దుగా చెల‌రేగాడు. త‌న‌తో పాటు పొరెల్ సూప‌ర్ షో చేశాడు. ఢిల్లీ బ్యాట‌ర్లు, బౌల‌ర్లు స‌మిష్టిగా రాణించారు. ల‌క్నోకు చుక్క‌లు చూపించారు. వ‌రుస‌గా ఈ టోర్నీలో ఆరో విజ‌యం ద‌క్క‌డం విశేషం. పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్ లోకి చేరింది. 160 ప‌రుగుల ల‌క్ష్యాన్ని 17.5 ఓవ‌ర్ల‌లోనే క్లోజ్ చేసింది.
⚠️ You are not allowed to copy content or view source