బాధితురాలికి జగ్గారెడ్డి రూ. 10 లక్షలు సాయం
NEWS Apr 22,2025 05:21 pm
టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గా రెడ్డి ఉదారత చాటుకున్నారు. సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలానికి చెందిన ఆమని గత కొంత కాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధ పడుతున్నారు. విషయం తెలుసుకున్న జగ్గారెడ్డి రూ. 10 లక్షలు ఆర్థిక సాయం అందజేశారు. ఆమెకు భరోసా కల్పించారు. తాను ఉన్నానంటూ పేర్కొన్నారు. ఆందోళన చెంద వద్దన్నారు.