సివిల్స్ ఫలితాల్లో సత్తా చాటిన తెలుగు విద్యార్థులు
NEWS Apr 22,2025 05:13 pm
అఖిల భారత సర్వీసు నియామకాల కోసం యూపీఎస్సీ నిర్వహించిన సివిల్స్ 2024 ఫలితాల్లో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. ఇ. సాయి 11వ ర్యాంకు, బన్నా వెంకటేశ్ 15, అభిషేక్ శర్మ 38, రావుల జయసింహారెడ్డి 46, శ్రవణ్ కుమార్ రెడ్డి 62, చైతన్య జాదవ్ 68 , ఎన్ చేతనరెడ్డి 110, చెన్నంరెడ్డి శివగణేష్ రెడ్డి 119 ర్యాంకు సాధించారు. మొత్తం 1009 మంది ఎంపిక కాగా.. శక్తి దూబేకు మొదటి ర్యాంకు వచ్చింది.