చెన్నమనేని రమేశ్పై డీజీపీకి ఫిర్యాదు
NEWS Apr 22,2025 05:10 pm
మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్పై డీజీపీ జితేందర్కు ఫిర్యాదు చేశారు ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్. భారత పౌరసత్వం లేకున్నా తప్పుడు పత్రాలతో ఎన్నికల్లో పోటీ చేశారని ఆరోపించారు. ఇప్పటికే చెన్నమనేనిపై కేసు నమోదు చేశారు సీఐడీ అధికారులు. మరో వైపు సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి నారాయణ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తీసుకున్న జీతాన్ని వెంటనే ప్రభుత్వానికి తిరిగి ఇవ్వాలని కోరారు. లేక పోతే కోర్టుకు వెళతానంటూ వార్నింగ్ ఇచ్చారు.