మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పై మరో కేసు నమోదు
NEWS Apr 22,2025 04:38 pm
ఏపీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ పీఎస్ఆర్ ఆంజనేయులుపై మరో కేసు నమోదైంది. ఇవాళ హైదరాబాద్ లో ఉన్న ఆయనను ఏపీ సిట్ బృందం అదుపులోకి తీసుకుంది. విజయవాడకు తరలించింది. సినీ నటి జెత్వానిని బెదిరించినందుకు గాను ఆయనపై కేసు నమోదైంది. మరో వైపు కేఆర్ సూర్యనారాయణను తుపాకీతో బెదిరించారని తాజాగా గుంటూరు సీఐడీ పీఎస్ లో మరో కేసు నమోదు చేశారు. ప్రస్తుతం సూర్య నారాయణ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం చీఫ్ గా ఉన్నారు.