టీపీసీసీ చీఫ్ ఆంధ్రా జపం సర్వత్రా ఆగ్రహం
NEWS Apr 22,2025 08:57 am
బాధ్యత కలిగిన టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తన స్థాయిని మరిచి కామెంట్స్ చేశారు. తెలంగాణ రైతులను అవమానపరిచేలా వ్యాఖ్యానించారు. ఆంధ్రోళ్లు వ్యవసాయం చేయడం నేర్పించారంటూ పేర్కొనడం పట్ల సర్వత్రా నిరసన వ్యక్తం అవుతోంది. సీఎంగా రేవంత్ రెడ్డి కొలువు తీరాక ఆంధ్రోళ్ల పెత్తనం పెరిగి పోయింది. ప్రజల మనోభావాలను పట్టించుకోకుండా చంద్రబాబుకు వంత పాడుతూ నిర్ణయాలు తీసుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి.