సత్తా చాటిన విద్యార్థులు
NEWS Apr 22,2025 08:03 am
రాష్ట్రీయ ఆవిష్కార్ అభియాన్ లో భాగంగా జిల్లా స్థాయిలో నిర్వహించిన క్విజ్ పోటీలలో మల్యాల మండల విద్యార్థులు సత్తా చాటారు. మల్యాల ఎంపీపీఎస్ కు చెందిన హిమశ్రీ, మండలంలోని మద్దుట్ల ఎంపీపీఎస్ చెందిన హరిప్రియ, హిమవర్షలు ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచి, ప్రశంసా పత్రాలు అందుకున్నారు. ఈ కార్యక్రమంలో డీఈవో రాము, డీసీఈబీ సెక్రటరీ మురళీ మోహన్ చారి, సైన్స్ ఆఫీసర్ రాజశేఖర్, సెక్టోరియల్ ఆఫీసర్ రాజేష్, తదితరులు పాల్గొన్నారు.