సీఎం చిత్రపటానికి పాలాభిషేకం
NEWS Apr 22,2025 08:03 am
మల్యాల కేంద్రంలోని బ్లాక్ చౌరస్తా వద్ద అఖిల భారత విశ్వకర్మ పరిషత్ జిల్లా అధ్యక్షులు చింతల రాజేశ్వర్ ఆధ్వర్యంలో సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. విశ్వకర్మల కుటీర పరిశ్రమలకు 10hp వరకు వున్న విద్యుత్ సబ్సిడీని రేవంత్ రెడ్డి 25hp వరకు సవరించి యూనిట్ కు అదే రూ.4 ఉంచినందుకు వారు హర్షం వ్యక్తం చేస్తూ పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో మండలాధ్యక్షుడు గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు ఆదిరెడ్డి, రాజేశ్వర్ రెడ్డి, రమేష్, శ్రీనివాస్ రెడ్డి, ఇమామ్, సాయి తదితరులున్నారు.