కిడ్నాప్ కలకలం.. యువకుడు సేఫ్
NEWS Apr 22,2025 08:04 am
కోరుట్ల మండలం గుమ్మలపూర్ లో తండ్రి వద్ద డబ్బులు వసూలుచేసేందుకు ఓ కుమారుడు కిడ్నాప్ నాటకం ఆడిన ఘటన చోటు చేసుకుంది. లక్ష్మీరాజం (23) శనివారం ఇంట్లో నుంచి వెళ్లిపోయి చిన్నాన్నకు ఫోన్ చేసి మీ అన్న కొడుకును కిడ్నాప్ చేశామన్నాడు. రూ.7లక్షలు డిమాండ్ చేశాడు. దీంతో కుటుంబసభ్యులు పోలీసులను ఆశ్రయించారు. ఫోన్ సహాయంతో యువకుడిని గుర్తించిన పోలీసులు కోరుట్ల తీసుకొచ్చారు.