త్వరలో రైతు ఖాతాల్లో డబ్బులు వేస్తాం
NEWS Apr 21,2025 05:59 pm
అతి త్వరలోనే ఖాతాల్లోకి రైతు భరోసా డబ్బులు వేస్తామన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిన పనులపై దృష్టి సారిస్తున్నామన్నారు. నిజామాబాద్ రైతాంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. పాత పథకాలను కొనసాగిస్తూనే కొత్త పథకాలను ప్రవేశ పెడుతున్న ఏకైక ప్రభుత్వం తమదన్నారు.