ఏసీబీకి చిక్కిన ఆర్ఐ
NEWS Apr 21,2025 05:51 pm
జనగాం జిల్లా చిల్పూరు మండల తహిసిల్ ఆఫీస్ లో లంచం తీసుకుండగా ఆర్ఐ వినీత్ కుమార్ ను ఏసీబీ పట్టుకుంది. ఫిర్యాదుధారునికి, అతని సోదరుడికి సంబంధించిన మ్యుటేషన్ దస్తావేజుకు సంబంధించిన క్షేత్రస్థాయి ధృవీకరణ నివేదికను సమర్పించేందుకు లంచం డిమాండ్ చేశారు. వారి వద్ద నుండి రూ. 26 వేలు తీసుకున్నాడు. పట్టుకున్న ఏసీబీ ఆర్ఐపై కేసు నమోదు చేశారు. ఎవరైనా లంచం అడిగినా లేదా డిమాండ్ చేసినా తక్షణమే టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా వాట్సాప్ 9440446106 కు ఫిర్యాదు చేయాలని కోరింది ఏసీబీ.