ఏపీలో మెగా డీఎస్సీ నోటిఫికేషన్
NEWS Apr 20,2025 06:41 pm
ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. నిరుద్యోగులకు తీపి కబురు చెప్పింది. మెగా డీఎస్సీని ప్రకటించింది. మొత్తం 16,347 టీచర్ పోస్టులను భర్తీ చేయనుంది. ఏప్రిల్ 20 నుంచి మే 15 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. జూన్ 6 నుంచి జూలై 16 వరకు పరీక్షలు నిర్వహించ నున్నారు. డీఎస్సీకి ఎలా దరఖాస్తు చేసుకోవాలో తెలుపుతూ మంత్రి నారా లోకేష్ ఎక్స్ వేదికగా వీడియో షేర్ చేశారు.